ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వేగవంతంగా మారుతుంది

ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వేగవంతంగా మారుతుంది, అందుకు తగ్గట్లుగా ఆంధ్రప్రదేశ్ యువతని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. రాష్ట్రంలోని యువతకు అప్రెంటి షిప్ కార్యక్రమాలను నిర్వహించి, అన్ని సదుపాయాలు అందించి యువతను ప్రంపంచంలో ఎక్కడైనా నైపుణ్యంతో పనిచేసేలా తీర్చిదిద్ది, టెక్నాలజీని అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలలో ఏ రంగంలోనైనా రాణించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని తయారు చేసి, ఆటోమేటెడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులను నేర్పించి విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించేందుకు కృషి చేస్తాను